ప్రాక్టికల్ సిలబస్ పూర్తి చేయాలి : డిఐఈఓ డా శ్రీధర్ సుమన్

Published: Tuesday February 15, 2022
ఆసిఫాబాద్ జిల్లా పీబ్రవరి 14 ప్రజాపాలన ప్రతినిధి : జిల్లా లోని ఇంటర్ కళాశాలల్లో ప్రాక్టీకల్ సిలబస్ ను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి (డిఐఈఓ) డా శ్రీధర్ సుమన్ అన్నారు. సోమవారం స్థానిక కళాశాలల్లో విద్యార్థుల సాధనను పరిశీలించారు. ఈ సందర్బంగా అధ్యాపకులకు పలు సూచనలు చేసారు. ఇంటర్ బోర్డు టైంటేబుల్ ప్రకారం మర్చి 23 నుండి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టీకల్ పరీక్షలు నిర్వహించబడుతాయని, సైన్స్ సబ్జెక్ట్ అధ్యాపకులు ప్రయోగ పరీక్షలకు నిర్దేశించబడిన 70 శాతం సిలబస్ను విద్యార్థులచే స్వయంగా అభ్యసనం చేయించి, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అన్నారు. బోర్డు నిర్వహించబోయే పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఆదేశించారు. కళాశాలలో ప్రయోగ సామాగ్రి చోటు లేకుండా విద్యార్థులకు తగు శిక్షణ ఇవ్వాలని ప్రిన్స్ పాళ్లను ఆదేశించారు.