వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే మధిర చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు
Published: Monday September 05, 2022
మధిర సెప్టెంబర్ 4 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలోవినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే మధిర చెరువు వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను మధిర సీఐ మురళి పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ మురళి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై సిబ్బందికి మరియు ఉత్సవ కమిటీ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అంబటి రమాదేవి టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ పాల్గొన్నారు
Share this on your social network: