రెబ్బెన లో వి.ఆర్.ఏ,ల నిరాహార దీక్ష" ** సిఐటియు జిల్లా అధ్యక్షుడు లోకేష్ ** సిఐటియు సంపూర్ణ మద్ద

Published: Saturday July 30, 2022
ఆసిఫాబాద్ జిల్లా జూలై29(ప్రజాపాలన, ప్రతినిధి) : వీ.ఆర్.ఏ, లకు రాష్ట్ర ముఖ్యమంత్రి పే స్కేల్ ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలని లేనిచో పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాలోని రెబ్బెన మండల కేంద్రంలో వి.ఆర్.ఏ,లు చేస్తున్న నిరాహార దీక్షలో పాల్గొని సిఐటియు ఎల్లవేళలా అండగా ఉంటుందని   మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అల్లూరి లోకేష్ మాట్లాడుతూ నిండు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ వి ఆర్ ఏ లకు పే స్కేల్ అమలుచేస్తున్నని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు. అర్హులైన వీఆర్ఏ లకు ప్రమోషన్స్, 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియు డిమాండ్ చేస్తుందన్నారు. ఈ నిరాహార దీక్షలో వెంకటేష్, రమేష్, రాజయ్య, బుద్ధజి, శంకర్,బొంద్యాలు, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area