అమ్మవారికి బంగారు పుస్తెలతాడు కానుకగా సమర్పించిన వెదిరే అరవింద్ రెడ్డి.

Published: Monday October 11, 2021
మేడిపల్లి, అక్టోబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి ) శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహంకాళి అమ్మవారిని  సినీ నిర్మాత  వెదిరే అరవింద్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ ఇబ్రహీంపట్నం ఇంచార్జ్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిలు అంబర్ పేట మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అరవింద్ రెడ్డి అమ్మవారికి రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు కానుకగా సమర్పించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇది తన పూర్వజన్మ సుకృతంగా అమ్మవారు కల్పించిన అవకాశంగా భావిస్తున్నానన్నారు. ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని కంచర్ల చంద్రశేఖర్ అన్నారు. ప్రతి పండుగ ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని అందుకు నిధులు కూడా విడుదల చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా మహంకాళి దేవాలయ కమిటీ ప్రతినిధులు వెదిరే అరవింద్ రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు. వారితో పాటు అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర అల్లు అర్జున్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం రవి కుమార్, కృష్ణ గౌడ్, నరసింహ రెడ్డి, గడ్డం శ్రీధర్ గౌడ్ లను దేవాలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.