ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
Published: Saturday October 01, 2022
మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడిపల్లి, సెప్టెంబర్30 (ప్రజాపాలన ప్రతినిధి)
లాభపేక్ష లేకుండా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కార్మికశాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు.
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్
19వ డివిజన్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎదురుగా నూతన భవనంలో కమల ప్రసూతి మరియు జనరల్ ఆసుపత్రిని స్థానిక కార్పొరేటర్
అలువాల సరిత దేవేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ లతో కలిసి మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ ఆశ అశోక్, కార్పొరేటర్లు మద్ది యుగంధర్ రెడ్డి, కొల్తూరి మహేష్ , కో ఆప్షన్ మెంబర్లు, సీనియర్ తెరాస నాయకులు, కాలనీ వాసుల, పెద్దలు, మహిళలు, హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: