వ్యాక్షినేషన్ పర్యవేక్షణలో అధికారులు నాయకులు ఇంటింటికి సర్వే...
Published: Friday October 29, 2021
బీరుపూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండల కేంద్రంలోని కోవిడ్ - 19 నిర్ములనలో భాగంగా గ్రామంలో అధికారులు నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరు వ్యాక్షినేషన్ తప్పకుండ వేసుకోవాలని గ్రామస్తులకు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అరిఫోద్దీన్ ఎంపీడీఓ మల్లారెడ్డి మెడికల్ ఆఫీసర్ రాణిమైత్రి రెడ్డి సర్పంచ్ గర్షకుర్తి శిల్పరమేష్ అంగన్వాడీ టీచర్స్ ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం నిర్మల్ కు చెందిన రంగు పురుషోత్తం దంపతులు గురువారం రోజున బీరుపూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో గుట్ట పైన భక్తుల కోసం రేకుల షెడ్ కు పుణ్యవచనం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్షకుర్తి శిల్పరమేష్ బైరవేణి ఆంజనేయలు గొడుగు కేశవులు ఆలయ సిబ్బంది అర్చకులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: