పోచమ్మ బోనాల పాటలను విడుదల చేసిన ఎమ్మెల్యే
Published: Monday August 02, 2021
జిన్నారం, ఆగస్టు 01, ప్రజాపాలన ప్రతినిధి : పటాన్చేరు నియోజకవర్గం లోని ఏడు గుళ్ళు పోచమ్మ బోనాల పాటలను విడుదల చేసిన స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిన్నారం గాయకుడు నాగేష్ చారి అమ్మవారి పై చక్కటి పాటలను పాడి భక్తులను అలరింప చేసినందుకు నాగేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజుల్లో తను మరెన్నో చక్కటి పాటలు పాడి విజయాలను సాధించాలని అభినందించారు అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాజు చారి వినయ్ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: