సంక్షేమ శాఖమంత్రి కుటుంబం త్వరగా కోలు కోవాలని ముస్లింలు సోదరులు ప్రత్యేక ప్రార్థనలు

Published: Saturday May 15, 2021
మైనారిటీ కో-ఆప్షన్ సభ్యులు మొహమ్మద్అలీ
​గొల్లపల్లి, మే14 (ప్రజాపాలన ప్రతినిధి) : ​గొల్లపల్లి మండలం తిర్మలపురం (పీ.డీ) గ్రామంలో తెలంగాణ ప్రభుత్వము మరియు సంక్షేమ మైనార్టీ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు లాక్ డౌన్ సందర్భంగా సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇంట్లోనే క్రమశిక్షణ ధాతృత్వం ధార్మిక చింతనలతో నెల రోజులఉపవాసదీక్షనుముగించు కొని నేడు అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా గొల్లపల్లి మండల మైనార్టీ కో- ఆప్షన్ సభ్యులు మొహమ్మద్ అలీ మండల ముస్లిం సోదరులకు ప్రజలకు తెరాస మండలనాయకులకు కార్యకర్త లకు రంజాన్ పండగా శుభాకాంక్షలు తెలిపారు. పేదల పెన్నిధి​ సంక్షేమ ముస్లిం మైనారిటీ శాఖల మంత్రి  కొప్పుల ఈశ్వర్ వారి శ్రీమతి ఎల్ఎమ్ కె చారిటి ట్రస్ట్ చైర్పర్సన్ స్నేహాలత మరియు వారి కుటుంబ సభ్యులు కోవిడ్ -19 బారినుండి త్వరగా కోలుకోవాలని భగవంతుని సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది.