విద్యార్థులకు బ్యాగ్స్, నోట్ బుక్స్ స్టేషనరీ పంపిణీ

Published: Tuesday June 14, 2022
బోనకల్, జూన్ 13 ప్రజాపాలన ప్రతినిధి: అందరికీ విద్య అందరి బాధ్యత అనే నినాదం తో బహుజన సాధికారత సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం పుల్లయ్య ఆధ్వర్యంలో అక్షర మార్గం అనే కాన్సెప్ట్ తో గోవిందా పురం (ఎల్) ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు బ్యాగ్స్,నోట్ బుక్స్ స్టేషనరీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంధం పుల్లయ్య మాట్లాడుతూ పేదరికంతో చదువుకు ఇబ్బంది పడే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మా యొక్క సహాయ సహకారాలు ఎప్పటికీ అందిస్తూనే ఉంటామని ముందు ముందు విడతలా వారీగా మండలంలో గల వివిధ పాఠశాలలో నోట్ బుక్స్, బ్యాగ్స్, ఫుట్ వేర్,టాలెంట్ టెస్ట్ లు ,స్కాలర్షిప్ లు ,ప్రతిభ గల విద్యార్థులకు నగదు ప్రోత్సాహ కం రూపంలో అందిస్తామని , అదే విధంగా తరగతి గదిలో ఉన్న విద్యార్థుల్లో నే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని చదువుకోలేక విద్యార్థులకు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్, యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి ఇరుగు నవీన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసెన పార్టీ విద్యార్థి విభాగ సభ్యులు గంధం ఆనంద్, బొనకల్ మండల బీఎస్పీ అధ్యెక్షుడు గంధం వంశీ, ఖమ్మం జిల్లా బీఎస్పీ పార్టీ ఐటీ సెల్ అధ్యక్షులు కె కళ్యాణ్,కొరివి వంశీ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది,రఘు,సిద్దు, తదితరులు పాల్గొన్నారు.