తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన కర్ర అనిత

Published: Monday October 04, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 3, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండల నూతన తహశీల్దారుగా కర్ర అనిత శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాననని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేసి మండలాన్నీ అభివృద్ధిలో నడిపిస్థానన్నారు. రెవిన్యూ సిబ్బంది అందరూ తమ విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆమె తెలిపారు. అనంతరం డిప్యూటీ తాసిల్దార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు తదితరులు తహసీల్దారు అనితను శాలువాలతో సన్మానించి, మిఠాయిలు పంచి హర్షం  వ్యక్తం చేశారు.