దీక్షా దివస్ ర్యాలీలో టిఆర్ఎస్వి నాయకులు
Published: Tuesday November 30, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ వచ్చుడో - కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధనకోసం 2009 నవంబర్ 29న కేసీఆర్ గారు అమరణ నిరాహార దీక్ష చేపట్టి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్షకు దిగి తన ఉక్కు సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు దీక్షాదివస్. ఈ సందర్భంగా... ఇబ్రహీంపట్నం బస్టాండ్ నుండి పెద్దచెర్వుకట్ట పై ఉన్న అమర వీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించి అమరవీరుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన టిఆర్ఎస్వి యువజన, విద్యార్థి విభాగం నాయకులు. అనంతరం ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన టిఆర్ఎస్వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి. రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జెర్కొని రాజు, టిఆర్ఎస్వి ప్రధాన కార్యదర్శి మైలారం విజయ్ కుమార్, నోముల వార్డు సభ్యులు, యువజన విభాగం కోశాధికారి చింతకింది విరేశ్ ముదిరాజ్, 6వ వార్డు అధ్యక్షుడు సొప్పరి కరుణాకర్, టిఆర్ఎస్వి మండల అధ్యక్షుడు నిమ్మల ప్రసాద్ గౌడ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి కొండ్రు మహేష్, మండలం ఉపాధ్యక్షుడు కొంకణి విజయ్ కుమార్, బంటి యూత్ ఫోర్స్ సభ్యులు ఆమంచ రంజిత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: