బుద్ధుని బోధనలు ప్రతిఒక్కరూ అనుసరించాలి

Published: Thursday May 27, 2021

మంచిర్యాల టౌన్, మే 26, ప్రజాపాలన ప్రతినిధి : మంచిర్యాల జిల్లా రామకృష్ణ పూర్ లో దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో 2565వ బుద్ధ జయంతి ని బుధవారం ఘనంగా నిర్వహించారు. బుద్ధుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీ ఎస్ పి మండలం కన్వీనర్ నందిపాటి రాజు, మండల మార్గధాత, అడ్వకేట్ రాజలింగు మోతె లు మాట్లాడారు. నేటి విద్యార్థులు, యువత బుద్ధుడు రచించిన పంచశీల బోధనలు, అహింస, సత్యం, ధర్మం వంటి వాటిని అనుసరించాలన్నారు. ప్రపంచ శాంతికి బుద్ధుని బోధనలను ప్రతీ ఒక్కరూ అవలంబించి, అనుసరించాలన్నారు. బుద్ధుని, ఆయన బోధనలను బహుజనులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దళిత బహుజన నాయకులు రామగిరి శేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.