మధిర పట్టణంలో ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Published: Tuesday February 01, 2022
మధిర జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంలో అత్యధికంగా సభ్యత్వాలు నమోదు చేసిన పగిడిపల్లి డేవిడ్ కు ఘనంగా సత్కరించినా రంగా హనుమంతరావు ఈరోజు మధిర పట్టణంలో మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిర్యాల వెంకటరమణ గుప్తా మధిర పట్టణ సభ్యత్వ ఇన్చార్జ్ పెండ్ర అంజయ్య ఆధ్వర్యంలో మధిర పట్టణంలోని 20 డివిజన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మధిర మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగా హనుమంతరావు మధిర పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు రంగా వెంకటేశ్వరరావు రంగా అప్పారావు కి సభ్యత్వ నమోదు బూత్ కమిటీ ఇంచార్జ్ రాజేంద్ర కుమార్ ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా మాజీ మార్కెట్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగా హనుమంతరావు మధిర మండలంలో దెందుకూరు గ్రామానికి చెందిన పగిడిపల్లి డేవిడ్ 550 అత్యధికంగా సభ్యత్వాలు నమోదు చేయడంతో ఘనంగా శాలువా కప్పి సత్కరించారు అలాగే  మధిర మండలం, పట్టణంలో 500 సభ్యత్వాలు ప్రతి ఒక్కరూ చేయాలని అన్నారు అలా చేసినవారికి గౌరవనీయులైన మల్లు భట్టి విక్రమార్క  చేతులమీదుగా ఘనంగా సత్కరిస్తాం అన్నారు కేసీఆర్ పాలనతో ప్రజలు విసుగు చెందారు అని కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అని అందుకు ఈ సభ్యత్వాల నమోదునే నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డ. మధిర పట్టణ బీసీ సెల్ బిట్ర ఉద్దండయ్యా అధ్యక్షుడు మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ మధిర పట్టణ కాంగ్రెస్ నాయకులు డివిజన్ అధ్యక్షులు కోట నాగరాజు, మాగం ప్రసాద్ దోర్నాల వీరస్వామి, ఆదిమూలం శ్రీనివాసరావు, మొదలగు వారు పాల్గొన్నారు