ఆదర్శ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు ** ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ **

Published: Tuesday August 30, 2022

ఆసిఫాబాద్ జిల్లా ఆగస్ట్ 29 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ద్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ద్యాన్ చంద్ సేవలు కొనియాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. అనంతరం  పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు తిరుపతికి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.