మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారంలో తెలుగుదేశం పార్టీ మధిర డిసెంబర్ 19 ప్రజా పాలన ప్రతినిధి ము

Published: Tuesday December 20, 2022

ఈనెల 21న ఖమ్మంలో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా స్థాయి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు సోమవారం మధిర పట్టణంలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ నిర్మాణాత్మక బలోపేతం దిశగా రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు అనంతరం సాయంత్రం 6 గంటలకు మధుర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఏర్పాటుచేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనున్నారు ఈ రెండు కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతూ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో ప్రచారాన్ని చేపడుతున్న నాయకులు కార్యకర్తలు గ్రామాలలో పార్టీ అభిమానులను భారీ ఎత్తున తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. వాసిరెడ్డి రామనాథం నేతృత్వంలో ప్రచారాలను ముమ్మరం చేసింది సోమవారంఇంటింటికి తెలుగుదేశం  ప్రచార కార్యక్రమం రాయపట్నం సెంటర్ నుండి డాక్టర్ వాసిరెడ్డి ప్రారంభించగా ఈ కార్యక్రమంలో  రాష్ట్ర పరిశీలకురాలు సాయి తులసి  చేకూరి శేఖర్ బాబు మైనీడి జగన్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మల్లాది హనుమంతరావు చెరుకూరి కృష్ణారావు కౌన్సిలర్లు వంకాయలపాటి నాగేశ్వరరావు వీరమాచినేని నాగ సులోచన పగిడిపల్లి విజయమ్మ కాశి రావు, నాయకులు గడ్డం మల్లేశ్వరరావుతోపాటు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.