విద్యుత్ పనులను ప్రారంభించిన సర్పంచ్ అలేఖ్య అశోక్..
Published: Wednesday September 14, 2022
తల్లాడ, సెప్టెంబర్ 13 (ప్రజాపాలన న్యూస్):
మండల పరిధిలోని కేశవపురం గ్రామ పంచాయతిలో డబల్ బెడ్ రూమ్ గృహాల విద్యుత్ పనులకు గ్రామ సర్పంచ్ వనిగండ్ల అలేఖ్యఅశోక్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భగా సర్పంచ్ అలేఖ్య మాట్లాడుతూ గతంలో డబల్ బెడ్ రూమ్ కాలనికి గ్రామ పంచాయతీ ద్వారా మిషన్ భగీరథ మంచి నీటి సరఫరా ఏర్పాటు చేశమని, తమ గ్రామంలో ఉన్న పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసి ఇచ్చినందుకు స్థానిక శాసనసభ్యులు సండ్రా వెంకట వీరయ్యకి తమ గ్రామ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి శక్తి వంచన లేకుండా చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రావూరి ఇజ్రాయిల్,వార్డు నెంబర్ సాదం నాగమణి, గ్రామ పెద్దలు చావా నాగేశ్వరరావు,సాదం రమేష్, చిన్నంశెట్టి శ్రీనివాసరావు, పాల్గొన్నారు.
Share this on your social network: