ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు

Published: Thursday April 06, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 5 (ప్రజాపాలన ప్రతినిధి)
స్వాతంత్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధానిగా సేవలందించిన బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలను రామంతాపూర్లో ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పడిగం నాగేష్  ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా రామంతాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు బండారు వెంకట్రావు పాల్గొని  ప్రధాన రహదారిలో నెలకొల్పిన బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ జయంతి వేడుకల్లో బీజేపీ నాయకులు ముత్తినేని జగదీష్, మహేందర్, రామంతాపూర్ డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శులు సంకూరి కుమారస్వామి, ఉలుగొండ నారాయణదాసు, మేడ్చల్ మల్కాజ్గిరి 
 బీజేపీ ఎస్సీ మోర్చా స్పోక్స్ పర్సన్ సాయిముత్యం, డివిజన్ ఓబిసి ప్రధాన కార్యదర్శి పర్రి శ్రీనివాస్, అల్లాడి నిరంజన్ గౌడ్, పలుగుల అంజయ్య పటేల్, తమ్మలి రవి పాల్గొన్నారు.