వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జెడ్పిటిసి దారిశెట్టి లావణ్య రాజేష్

Published: Tuesday January 03, 2023

కోరుట్ల, జనవరి 02 (ప్రజాపాలన ప్రతినిధి):
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా కోరుట్ల మండలం లోని జోగన్ పల్లి గ్రామంలో  కోరుట్ల జడ్పిటిసి దారిశెట్టి లావణ్యరాజేష్  ,జిల్లా సర్పంచ్ పోరం అధ్యక్షులు,బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్ శ్రీ లక్ష్మి  వెంకటేశ్వర స్వామిని  దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక  సర్పంచ్ దుంపల నర్సు రాజనర్సయ్య, కల్లూరు సర్పంచ్ వనతడుపుల అంజయ్య,  ఇతర నాయకులు బద్ది శేఖర్, కొండ్రా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.