ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసినప్పుడే వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాం:ఎమ్మెల్

Published: Saturday June 26, 2021
సొంత నిధులతో సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
జిన్నారం, జూన్ , ప్రజాపాలన ప్రతినిధి : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసినప్పుడే వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండలం ఊట్ల గ్రామపంచాయతీ మధిర గ్రామమైన దాది గూడెం గ్రామంలో సిసి రోడ్డు నిర్మిస్తానని గతంలో గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జి వి ఆర్ ఎంటర్ప్రైజెస్ తరపున 25 లక్షల రూపాయల నిధులతో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.