ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు మధిర మే 11 ప్రజాపాలన ప్రతినిధి
మధిర మండలంలో మున్సిపాలిటీలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని మండల విద్యాశాఖ అధికారి వై. ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 3 నుంచి 11వరకు జరిగిన 10వ తరగతి పరీక్షల నందు చీఫ్ సూపరింటెండెంట్స్ , డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, కస్టోడియన్స్, సిట్టింగ్ స్క్వాడ్ , ఇన్విజిలేటర్స్ గా విధులు నిర్వహించిన ఉపాధ్యాయుల సహకారంతో పాటుగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకారంతో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని తెలియజేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి మధిర మండల విద్యాశాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవత్సరం మధిర మండలం నుండి 1037 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా ఇందులో ఐదు మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 1032 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది.
Share this on your social network: