పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్

Published: Wednesday June 15, 2022

రాయికల్, జూన్ 14 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పట్టణం 5వ వార్డు పట్టణ ప్రగతికార్యక్రమములోమున్సిపల్ కమిషనర్ గంగుల సంతోష్ కుమార్ పాల్గొని వార్డులోని మురికి కాలువలశుభ్రత, రోడ్ కు ఇరువైపులాఉన్న చెత్త చెదారం పిచ్చిమొక్కలను తొలగించుట,గుంతలలో నిల్వ ఉన్నమురికినీరు జెసిబి సహాయంతో మురికి కాలువలకి పంపించడం, మురికి కాలువలపై బ్లీచింగ్ చల్లించడం వంటిపారిశుధ్యపనులను ఆయనపర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ వల్లకొండ మహేష్ పురపాలక సంఘం మేనేజర్ వెంకటి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.