మండలంలో 47 మందికి కరోనా పాజిటివ్

Published: Wednesday May 12, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వలిగొండ, వర్కట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో మంగళవారం 123 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 47 మందికి పాజిటివ్ నిర్దారణ అయిందని, వారికి కరోనా పట్ల తీసుకోవాలిసిన జాగ్రత్తలు తెలిపి, వారిని హోమ్ క్వారెంటైన్ చేశామని డాక్టర్లు సుమన్ కళ్యాణ్, స్వామి లు తెలిపారు.