ఎంపీ ధర్మపురి అరవింద్ సంక్షేమ నిధి నుంచి కార్యకర్తలకు అందజేత

Published: Monday May 09, 2022

ఇబ్రహీంపట్నం, మే 08 (ప్రజాపాలన ప్రతినిధి) : మండలంలోని ములరాంపూర్ గ్రామంలో బీజేపీ కార్యకర్త  పందిరి సురేష్ ఇటీవల చనిపోయిన విషయం తెలిసిందే వారి కుటుంబానికి శనివారం రాత్రి నిజామాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో మనప్రియతమ నాయకుడు ఎంపీ అరవిందన్న తన ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ కార్యకర్తల సంక్షేమ నిది నుండి పందిరి సురేష్ కుటుంబానికి 150,000 రూపాయల చెక్కును అందివ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మండల అద్యక్షులు బట్టు జకరయ్య మాట్లాడుతూ కార్యకర్తలను కరివేపాకులా వాడుకొని వదిలివేసే ఈ రోజుల్లో మాట ఇచ్చిన ప్రకారం కార్యకర్తలను కార్యకర్తల కుటుంబాలను మరియు చిన్న పిల్లలను. ఆదుకుంటున్న మన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవిందన్న చాలా గొప్పవ్యక్తి అని కొనియాడారు ఇబ్రహీంపట్నం మండల పార్టీ శాఖ తరపున ధన్యవాదములు తెలిపారు మరియు దానికి సహకరించిన కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ జె ఎన్ వెంకట్ బీజేపీ ఇబ్రహీంపట్నం మండల పార్టీ తరపున ధన్యవాదములు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సుంచు రణదీర్ జిల్లా దళిత మోర్చా ప్రదాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ మాజీ జడ్పీటీసీ  జంగిలి సునీత తదితరులు పాల్గొన్నారు.