వైకుంఠ ధర్మాలకు మిషన్ భగీరథ నీరు అందించాలి

Published: Monday June 13, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో జూన్ 12 ప్రజా పాలన :
వైకుంఠదామాలన్నింటికి పది రోజులలో మిషమ్ భగీరథ మంచి నీటి సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. ఆదివారం కలెక్టర్ కార్యక్రమం లోని కాన్ఫరెన్స్ హాలులో మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా ఇంజనీరింగ్ అధికారులతో మండలాల వారిగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 566 వైకుంఠ దామాలలో ఇప్పటి వరకు 129 వైకుంఠ దామలకు మాత్రమే మిసన్ భగీరథ నీటి సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు.  మిగిలిన 437 వైకుంఠ దామలకు వివిధ సమస్యల కారణంగా చేపట్టలేదన్నారు. ఇట్టి పనులను ఏలాంటి సాకులు చూపకుండా సర్పంచుల సహకారంతో పనులను వేగవంతం చేసి, అన్ని సమస్యలను ఆదిగమించి 10 రోజులలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.  మండల స్పెషల్ ఆఫీసర్లు, ఏఇ లు ఇట్టి పనులలో ప్రత్యేక శ్రద్ధ వహించి పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. 
ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డి ఆర్ డి ఓ కృష్ణన్,  జిల్లా రెవిన్యూ అధికారి విజయ కుమారి, డీపీవో మల్లారెడ్డి, మిషన్ భగీరథ  ఇ ఇ బాబు శ్రీనివాస్, డిఇ లు, ఏఇ లు తదితరులు పాల్గొన్నారు.