పల్లే ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
Published: Saturday June 04, 2022
ఇబ్రహీంపట్నం, జూన్ 03 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని ఇబ్రహీంపట్నం మరియు వర్షకొండ గ్రామాల్లోలో 5 వ విడత పల్లే ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు,జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ లు ప్రారంభించారు. అనంతరం క్రీడా మైదానము మరియు మండల పరిషత్ పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ భారతి ఎంపీపీ భీమేశ్వర, సర్పంచ్ లత సత్య నారాయణ, శ్యామల ఎంపీటీసీ రాములు,వెంకటీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరస్వతి, వైస్ ఎంపీపీ లక్ష్మ రెడ్డి, మండల రైతు బందు నాయకులు సుగుణాకర్, స్పెషల్ అధికారి జిల్లా జడ్పీ సీఈవో సుందర వరధరజన్, ఎంపీడీవో ప్రభు, అదికారులు ప్రజ ప్రతినిధులు నాయకులు ఆశ వర్కర్ల, సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: