మగువలే మహా రాణులు పురస్కారం

Published: Friday March 12, 2021
అశ్వారావుపేట ప్రజాపాలన ప్రతినిధి; అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు అశ్వారావుపేట కు చెందిన శ్రీమతి ఉషా దేవి కి అరుదైన పురస్కారం లభించింది. నిర్మల మహిళ పరపతి సంఘం  అధ్యక్షురాలు నిర్మల ఆధ్వర్యంలో ప్రముఖ మహిళ మణులని  మగువలె మహార ణులు కేప్షన్ కింద సన్మానించారు. ఈ సన్మానము హైదరాబాద్ లోని తెలంగాణా సరసాత్విక పరిషత్ హాల్ లో, వివిధ కళారూపాలతో ప్రాంభించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణ నుంచి శ్రీమతి, ఉషాదేవి (అంగన్వాడీ టీచర్) కవయిత్రి, మహిళలు ఎదుర్కొంటున్న సమస్య లపై,వాటిపై కవితలు వ్రాసారు, అతితక్కువ జీతంతో ఉషారాణి 2020 సంవత్సరం లో గ్రామసేవకులకు, పేద వృద్ధులకు వస్త్రాలు, మహిళలకు చీరలు పంపిణీ చేసినారు, 2021 న మహిళ దినోత్సవం సందర్భంగా గ్రామసేవకులకు పదపూజా చేసినారు, ఈ సంవత్సరం మరింత మందికి చీరలు, మరియు సన్మానం చేసినారు, కొంతమంది అంగన్వాడీ టీచర్స్ కి హెల్పేర్ లను, సత్కరించటం జరిగింది, కవి, విశ్లేషకులు  లెండర్ రేడియో ప్రతినిధిలు, పి ఎన్ మూర్తి గారు ఉషాదేవి  చేసిన సేవలకు, గుర్తించి సన్మానించడం జరిగింది.