కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేయించుకోవాలి

Published: Monday February 14, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 13 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌనీ బాల్రాజ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు  ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు పార్టీ సభ్యులుగా సభ్యత్వం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు  తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆన్లైన్ ద్వారా సభ్యత్వ నమోదు చేయించుకోవాలని మున్సిపల్ అధ్యక్షులుగౌని బాల్రాజ్ గౌడ్ కోరారు. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు కైవసం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేయాలని కంకణ బదులులై పనిచేయాలని ఆయన కోరారు.