అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి వార్డు కౌన్సిలర్ కట్ట గాంధీ

Published: Wednesday July 14, 2021
మధిర, జులై 13, ప్రజాపాలన ప్రతినిధి : అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని 22వ వార్డు కౌన్సిలర్ కట్టా గాంధీ కోరారు. అంగన్వాడీ ద్వారా బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు, అందించే పౌష్టికాహారాన్ని మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారంతో చిన్నారుల్లో గర్భిణీలకు, బాలింతల్లో రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ నిర్మల ఆర్పి ఆశా వర్కర్ పాల్గొన్నారు