వీణవంక మండల కేంద్రంలో ఈరోజు జరిగిన సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక
Published: Thursday November 03, 2022
వీణవంక మండల కేంద్రంలో ఈరోజు జరిగిన సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బూర్ల మొగిలి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పాటు పడ్డాడని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కమిషన్ను భర్తీ చేయక తాత్సరం చేస్తుందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ కమిషన్ను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలోనే వీణవంక మండలంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సన్నాహక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు అలాగే మహిళా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు అయన తెలిపాడు ఈ కార్యక్రమమోలో ఎల్కపల్లి సుధీర్ దుర్గం కిషన్ తదితరులు పల్గొన్నారుు
Share this on your social network: