ఇంజనీరింగ్ విద్యార్థికి ఎన్నారైల ఆర్థిక చేయూత

Published: Tuesday February 01, 2022
బోనకల్, జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధి లోని గోవిందపురం (ఎల్) గ్రామానికి చెందిన కోసూరి శ్రీనివాసరావు మమత దంపతుల కుమార్తె ఇంజనీరింగ్ విద్యార్థి నవ్య కు అమెరికాలో స్థిరపడిన ఎన్నారైలు లోకేష్ నాయుడు మరియు జాస్తి వెంకట్ గార్ల సహాయంతో 70 వేల రూపాయల విలువగల ల్యాప్టాప్ మరియు విద్యార్థి హాస్టల్ ఖర్చులకు సంబంధించి ఒక సంవత్సరం ఖర్చు రూ 50 వేల రూపాయలు అందించడం జరిగింది. శ్రీనివాసరావు కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ సహాయం చేస్తున్నట్లు కమిటీ సభ్యులు లోకేష్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సాయం అందించిన ఎన్నారైలకు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. లాప్టాప్ మరియు 50 వేల రూపాయల విలువ చేసే చెక్కు యుటిఎఫ్ జిల్లా కోశాధికారి వల్లం కొండ రాంబాబు ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ రాంబాబు కుటుంబ సభ్యులు రాణి, సురేష్, రేణుక, సుమంత్, సుశాంత్, బ్లెస్సీ తదితరులు పాల్గొన్నారు.