శ్రీరామ భక్తులకు పులిహోరా పానకం పంపిణీ చేసిన మారిశెట్టి

Published: Thursday April 22, 2021
పాలేరు ఏప్రిల్ 21 ప్రజాపాలన ప్రతినిధి : నేలకొండపల్లి లో శ్రీ రామనవమి పండుగ సందర్భంగా పాలేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ మారిశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నేలకొండపల్లి మండలం మున్నూరు కాపు సంఘం మరియు నేలకొండపల్లి పట్టణ కమిటీ మున్నూరు కాపు సంఘం తరపున వడపప్పు పానకము భక్తులకు పంపిణీని చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నేలకొండపల్లి పొట్టిశ్రీరాములు సెంటర్లో నిర్వహించినాము. మారిశెట్టి వెంకటేశ్వరరావు పటేల్ మాట్లాడుతూ మున్నూరు కాపు కులస్తులు అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపు కులానికి ప్రత్యేకంగా కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో నేలకొండపల్లి పట్టణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు తొట శ్రీను పటేల్, బాజా నాగేశ్వరరావు పటేల్, కందికొండ శ్రీను పటేల్, తోట నరసింహంరావు పటేల్, కందికొండ సత్యం పటేల్, లేపాల రాములు పటేల్, బాజా నాగభూషణం పటేల్, మిట్టపల్లి సైదులు పటేల్, మారిశెట్టి విజయదుర్గ, బాజా వనజా ఇంకా తదితరులు పాల్గొన్నారు.