రాష్ట్ర ఐటీమంత్రి కేటీఆర్ ను కలిసిన హుస్సేన్.

Published: Wednesday July 20, 2022
తల్లాడ, జులై 19 (ప్రజా పాలన న్యూస్):
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు షేక్. హుస్సేన్ కలిశారు. మంగళవారం హైదరాబాదులో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఆయన మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి హుస్సేన్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాదులో మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. టిఆర్ఎస్ తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన జోస్యం చెప్పారు.