కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన పిఎస్ఆర్ .

Published: Monday August 29, 2022
మంచిర్యాల టౌన్, ఆగష్టు 28, ప్రజాపాలన: మంచిర్యాల నియోజకవర్గంలో పలు కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన  మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి మండలం కన్నెపల్లిలో ఎం.డి.సాధిక్ హుస్సేన్ రోడ్ ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు 5000/- రూపాయలు,
అనారోగ్యంతో మృతి చెందిన కొట్టే బాణయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, అనారోగ్యంతో కోలుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్త చుంచు కిషన్ ను పరామర్శించగా, వెల్గనూర్ లో రోడ్ ప్రమాదంలో మృతి చెందిన సిద్ధం శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి, 5000/- రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు, అనారోగ్యంతో మృతి చెందిన మురుపుటాల గోపాల్ కుటుంబ సభ్యులను పరామర్శించి, అనారోగ్యంతో మృతి చెందిన కొంతం రాజవ్వ కుటుంబ సభ్యులను పరామర్శించి, 5000/- రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరిగింది, కాసిపేట లో అనారోగ్యంతో కోలుకుంటున్న నల్లేల శంకరమ్మను పరామర్శించి, 5000/- రూపాయలు ఆర్ధిక సహాయం అందజేసి, ఇటివల దుబాయ్ లో కొంపల శ్రీనివాస్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందడంతో మాదాపూర్ లో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,5000/- రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు, నాగసముద్రంలో అనారోగ్యంతో మృతి చెందిన అల్లోల రాజయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, 5000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేసి, మండల కో-అప్షన్ సభ్యులు లల్లు తండ్రి అనారోగ్యంతో ఉండడంతో వారిని పరామర్శించి, మామిడిపల్లిలో ఆత్మహత్య చేసుకున్న బొమ్మిడీ రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించి, 5000/- ఆర్ధిక సహాయం అందజేసి, పాత మంచిర్యాలలో అనారోగ్యంతో మృతి చెందిన మేడ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి, 5000/- రూపాయలు ఆర్ధిక సహాయం అందజేసిన మాజీ ఎమ్మెల్సీ, ఎఐసిసి సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
 
 
 
Attachments area