గ్రామ విధుల్లో హైపో క్లోరైడ్ ద్రావం పిచికారీ

Published: Friday April 30, 2021
గుమ్మడిదల, ఏప్రిల్ 29, ప్రజాపాలన ప్రతినిధి : గుమ్మడిదల గ్రామంలో కరోనా నివారణలో భాగంగా గురువారం రోజు గ్రామ పంచాయతీ పాలకుల ఆధ్వర్యంలో గ్రామ విధుల్లో హైపో క్లోరైడ్ ద్రావని పిచికారీ చేశారు, ఈ సందర్భంగా వార్డు సభ్యుడు ఆకుల సత్యనారాయణ, టిఆర్ఎస్ యువ నాయకుడు పొన్నాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వ్యాధి రెండోవ దశలో దాని ప్రభావం తీవ్రంగా ఉందని, వ్యాధి బారిన పడకుండా తగు చర్యలు అందరు పటించాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయట తిరగొద్దని, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించించి, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపర్చుకోవలని, బౌతికాదూరం పట్టించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దాసరి ఆంజనేయులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు..