మైలారం సీఈఓ మాక్బుల్ కు నివాళి
Published: Thursday March 04, 2021
మధిర మార్చి 4 ప్రజాపాలన ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, రాచకొండదండు మైలారం PACS సీఈఓ మాక్బుల్ గారు ఆత్మహత్య చేసుకుని మరణించడం పట్ల బుధవారం నాడు మధిర FSCS కార్యాలయంలో జరిగిన సంతాప సభలో FSCS మధిర, PACS సిద్దినేని గూడెం, దెందుకూరు, మోటామర్రి, కలకోట ల సీఈఓ గార్లు మరియు సిబ్బంది పాల్గొని సంతాపం తెలుపుతూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరారు అలానే వారి కుటుంబ సభ్యులకు ఖమ్మం జిల్లా సహకార సంఘాల సిబ్బంది ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో లని సహకార సంఘం ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడి తో విధులు నిర్వహిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఉద్యోగులు ఆత్మహత్యలకు ఇలాంటి ఒత్తిడులను తట్టుకొని ధైర్యంగా ఉండాలి కానీ తనువు చాలించిన కూడదు అని అన్నాడు వీటివల్ల వారి కుటుంబ సభ్యులు వీధిన పడతాడు అని అన్నారు వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్దిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో విప్ప శ్రీనివాసరావు దామా శ్రీనివాసరావు నెలకు టి వెంకటేశ్వరరావు చిట్టి మోడల్ వెంకటేశ్వరరావు వనమా మల్లికార్జున్ పబ్బతి సుబ్బారావు సిబ్బంది పాల్గొన్నారు
Share this on your social network: