మండల ఎం ఈ ఓ గా అదనపు బాధ్యతలు చేపట్టిన వై ప్రభాకర్

Published: Wednesday November 23, 2022
బోనకల్, నవంబర్ 22 ప్రజా పాలన ప్రతినిధి: మధిర మండల ఎంఈఓ గా పనిచేస్తున్న వై ప్రభాకర్ 
ఇప్పటికే ఇంచార్జ్ ఎంఈఓ గా ఎర్రుపాలెం మండలం లో కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనితోపాటు బోనకల్ మండల ఎంఈఓ ఇందిరా జ్యోతి, లాంగ్ లీవ్ పై యూఎస్ వెళ్తున్న సందర్భంలో బోనకల్ మండల విద్యాశాఖ ఇంచార్జ్ ఎంఈఓ గా మధిర మండల ఎంఈఓ గా పనిచేస్తున్న వై ప్రభాకర్ ను నియమిస్తూ ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య చే 22-11-2022 నుండి బోనకల్ మండల విద్యాశాఖ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అదనపు బాధ్యతలు చేపట్టిన వై ప్రభాకర్ ను మండల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.