మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి రైతులతో కలిసి సాగర కాలవపై దీక్షకు దిగిన సర్పంచ్ తిరుపతిరావు

Published: Monday March 06, 2023
 బోనకల్, మార్చే 5 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామ మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని ఆదివారం గ్రామ సర్పంచ్ మర్రి తిరుపతిరావు పొలాల వద్దనే రైతులతో దీక్షకు దిగారు. ఎన్ ఎస్ పి డి ఇ రామబ్రహ్మం ను సంప్రదించగా డి ఈ రామబ్రహ్మం ఆళ్లపాడు గ్రామానికి వచ్చి సాగర్ కాలవలు చూసి నీళ్లు అవసరమా అని గుర్తించి తప్పనిసరిగా మీకు నీళ్ళు ఇచ్చే మార్గం చేస్తానని హామీ ఇచ్చారు. లేనిపక్షంలో రేపటినుండి ఎన్ఎస్పీ ఆఫీస్ బోనకల్లు కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు రైతులతో కలిసి చేస్తానని సర్పంచ్ , రైతులు తెలియజేశారు. వారబంది ప్రకారం నీళ్లు రావాల్సి ఉండగా నాలుగు రోజులు పూర్తయినప్పటికీ నీళ్లు రాకపోగా ఇంకా మూడు రోజులుమాత్రేమే సమయం ఉన్నందున రైతులు ఆందోళన చెందుతూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ సాగరనేటిని అందించి మమ్మల్ని కాపాడాలని ఎన్ఎస్పి డీఈ నీ రైతులు కోరారు.