పలు కాలనీలు సందర్శించారు 45వ డివిజన్ కార్పొరేటర్

Published: Thursday May 20, 2021
బాలపూర్, ప్రజాపాలన ప్రతినిధి : స్థానిక కార్పొరేటర్ అక్కి మాధవి ఈశ్వర్ గౌడ్ డివిజన్ ప్రజలను వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మీర్ పెట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 45వ డివిజన్ లో  మీర్ పెట్ పాత గ్రామంలో హైడ్రో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి బుధవారం నాడు స్వయంగా స్థానిక కార్పొరేటర్ అక్కి మాధవి చేశారు. అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ చల్లటం జరిగింది. అన్ని విధులలో తిరిగి పరియవెక్షిoచారు. స్థానిక ప్రజలను వారి యోగక్షమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.... ఈ కారొన సెకండ్ వేవ్ తీవ్రత సందర్భముగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచనలనీ పాటించాలని అమే కోరారు. కరోనా ఇవ్వరికైన లక్షణాలు ఉన్నటైతే తక్షణం టెస్ట్ చేయించుకోవాలని చెప్పారు. పి.హెచ్.సి లో కోవిడ్ మెడిసిన్ కిట్ అందుబాటులో ఉన్నాయంటూ, ఇంకా ఏదైన ఇబ్బంది ఉన్న డివిజన్ లో ఉన్న కాలని వాసులందరు తనని సంప్రదించగలరుని, ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.