గురుకుల పాఠశాలలను సందర్శించిన యువజన కాంగ్రెస్ నాయకులు

Published: Wednesday August 03, 2022

కోరుట్ల, ఆగస్టు 02 (ప్రజాపాలన ప్రతినిధి):

యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ రావు ఆదేశాల మేరకు, కోరుట్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కోరుట్ల నియోజకవర్గం లోని కోరుట్ల , మేట్ పల్లి ప్రాంతాల లోని మైనార్టీ గురుకుల పాఠశాల, పెద్దాపూర్ లోని గురుకుల పాఠశాలను మంగళ వారం రోజున యువజన కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలోని ప్రిన్సిపల్ లతో విద్యార్థులకు అందించే ఆహార మెనూ,వంట గదులు, హాస్టల్ కి సంబంధించిన రూమ్ లను పరిశీలించి వివరాలను తెలుసుకొని, సిజనల్ వ్యాధుల పట్ల ఉండాలని అప్రమత్తంగా ఉండాలని పాఠశాల చుట్టుపక్కల సనిటైజేషన్ చేయాలని కోరారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడిన యువజన కాంగ్రెస్ నాయకులు వారికి టాయిలెట్ రూమ్ సమస్య వుందని తెలుపగానే, ఈ సమస్యను ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లామని,

వెంటనే విద్యార్థులకు టాయిలెట్స్ రూమ్ సమస్యను తీర్చాలని ప్రిన్సిపల్ ని కోరామని యువజన కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ,మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ.రిజ్వన్ పాషా, పన్నల అంజి రెడ్డి, మల్లాపూర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పోతు శేఖర్, నియోజక వర్గ ప్రధాన కార్యధర్శులు సరికెల్ల నరేష్, మ్యాధరి లక్ష్మణ్, కోరుట్ల మండల యువజన కాంగ్రెస్ ఉపధ్యక్షులు సైదు గంగాధర్, యువజన కాంగ్రెస్ నాయకులు సత్యం, ఎండీ.జకీర్, సత్యనారాయణ పాల్గొన్నారు.