ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బెడ్ షీట్స్ పంపిణీ

Published: Tuesday July 19, 2022
మంచిర్యాల టౌన్, జూలై 18, ప్రజాపాలన :  మంచిర్యాల పట్టణంలో ఎన్.టి.ఆర్ నగర్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా శాఖ తరుపున సోమవారం రోజున, 150 మంది నిరుపేద వరద బాధితులకు 300 బెడ్ షీట్స్ పంపిణీ  చేశారు.ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా చైర్మన్ కంకణల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ   ఆధ్వర్యంలో  పలు సేవ కార్యక్రమాలు చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ చంధూరి మహేందర్, జిల్లా కోశాధికారి పడాల రవీందర్, మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు సత్యపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు