నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ..
Published: Monday July 11, 2022
తల్లాడ, జులై 9 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల కు చెందిన పేద విద్యార్థులకు కారుణ్య సర్వీస్ సొసైటీ అండగా నిలవడం అభినందననీయమని తల్లాడ సొసైటీ అధ్యక్షులు రెడ్డెO వీరమోహన్ రెడ్డి అన్నారు. నారాయణపురం గ్రామంలో ఆదివారం కారుణ్య సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని అన్నారుగూడెం,గోపాలపేట,జగన్నాధపురం, మంగాపురం, నారాయణపురం, గ్రామాలకు చెందిన 300 మంది విద్యార్థులకు నోటుపుస్తకాలు, పెన్నులు, ప్యాడ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కారుణ్య సర్వీస్ సొసైటీ అధ్యక్షురాలు గొడుగునూరి జాన్సీ, కార్యదర్శి గొడుగునూరి బాలరెడ్డి,వేమూరి సత్యనారాయణ,తాళ్లపల్లి కృష్ణ,శీలం తిరుపతిరెడ్డి, జి తిరుపతమ్మ, తిగుళ్ల నరసింహారావు, అంకమరాజు, నరసింహారావు పాల్గున్నారు.
Share this on your social network: