పల్లె ప్రగతిలో గ్రామాభివృద్ధి

Published: Friday July 02, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని కేర్చి పల్లి గ్రామంలో గురువారం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మద్దెల మంజుల నాగరాజు అధ్యక్షతన గ్రామసభ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4వ విడత పల్లె  ప్రగతి పనులను ప్రారంభించారు. గ్రామంలో వీధుల్లో తిరిగి గ్రామ ప్రజలను గ్రామంలో కావలసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామ సభలో మాట్లాడి పల్లె ప్రగతి కార్యక్రమంలో ఇంకుడు గుంతలు, ఇంటింటికి చెట్ల పంపిణీ, గ్రామ వీధుల్లో బ్లీచింగ్ పౌడర్, త్రాగు సాగు నీరు గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏవో పి సాయి, పంచాయతీ కార్యదర్శి స్వప్న, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ వసంత, ఆశ కార్యకర్త జ్యోతి తదితరులు పాల్గొన్నారు