పుట్టిన రోజు సందర్భంగా పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Published: Friday December 24, 2021

కోరుట్ల, డిసెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల పట్టణానికి చెందిన పచ్చిమట్ల హరికృష్ణ దివ్య కుమారులు నయాన్, నిహాన్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోనీ 22 వార్డులో కౌన్సిలర్ మడవేణి నరేష్, ఆర్ముర్ వినోద్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. 5 కుటుంబాలకు ఒక్క కుటుంబానికి కింటల్ ఇరవై ఐదు కేజీల 125 కేజీ బియ్యం, 25 కేజీ పప్పు, నూనె, చెక్కర, ఉప్పు, పిండి, చాయ్ పత్తి, మరియు 40 మంది అనాధలకు స్వయంగా వండి భోజనాన్ని పంపిణి చేసారు. ఈ సందర్భంగా మడవేణి నరేష్, ఆర్ముర్ వినోద్ లు మాట్లాడుతు పేద ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటు సహాయం చేస్తామని తెలిపారు.