ఎమ్మెల్యే చొరవతో చెన్నారం నుండి కొరట్లగూడెం పాత డొంక కి మహర్దశ..

Published: Wednesday June 30, 2021
పాలేరు, జూన్ 29 ( ప్రజాపాలన ప్రతినిధి) : నేలకొండపల్లి మండలం లోని. చెన్నారం నుండి పాత కోరట్ల గూడెం పోయి డొంకకి మహర్దశ పట్టించారు.. నేలకొండపల్లి మండలం లోని చెన్నారం గ్రామం రైతులు మరియు మంద్రజుపల్లి కొత్తూరు గ్రామ రైతులు తమ పొలాల్లోని సాగు చేసుకున్నటువంటి ధాన్యం మరియు చెరుకు తమ గమ్యస్థానాలు చేరుటకు రవాణా చేయాలంటే చెన్నారం పోయి చుట్టూ తిరిగి పది కిలోమీటర్ల చుట్టూ తిరిగి షుగర్ ఫ్యాక్టరీ కి చేరవలసి ఉంటుంది అదే సమయంలో రైతులు పడుతున్న ఆటువంటి ఇబ్బందులను నెలకొండపల్లి ఎంపీపీ వజ్జా రమ్య గారు పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి గారి. దృష్టికి తీసుకుపోగా ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి రోడ్డుకి. కోటి పది లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగినది.ఇట్టి రొడ్డునూ ఈరోజు ప్రారంభించటం జరిగినది ఇట్టి కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వజ్జా శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ చాగంటి మధుసూదన్ రావు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గంజికుంట్ల వెంకన్న, చింతనిప్పు సైదులు, మంకెన వెంకటేశ్వర రావు, కొక్కిరేణి నాగేశ్వరరావు, వజ్జా బుచ్చయ్య, కొవ్వూరి పుల్లయ్య, గడు పూరి అప్పారావు, వజ్జా రామారావు, పసుపులేటి శ్రీను, వజ్జావెంకట రామారావు, కందిబండ నాగేశ్వర రావు, మంకెన బుచ్చయ్య, కాంట్రాక్టర్ సామినేని వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.