గురుకుల పాఠశాలను పరిశీలించిన సీఎల్పీ నేత
Published: Friday September 02, 2022
బోనకల్, సెప్టెంబర్ 1 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రం లో ఉన్న ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలను గురువారం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పరిశీలించి అక్కడ వసతులు, తరగుతుల నిర్వహణ వివరాలను బాలికలను గురుకుల పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అన్ని తరగతి గదులు, డైనింగ్,వంట గది ,పాఠశాల పరిసారలను తిరిగి ఆయన పరిశీలించారు. అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Share this on your social network: