జాతీయ జెండాను ఆవిష్కరించిన కార్పొరేటర్ సుభాష్ నాయక్

Published: Friday January 27, 2023
మేడిపల్లి, జనవరి 26 (ప్రజాపాలన ప్రతినిధి)

 74వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సుభాష్ నాయక్ డివిజన్ కార్యాలయంతో పాటు డివిజన్లోని పంచవటి కాలనీ, కమలానగర్, ఎంకెబిఆర్ కాలనీ, ఎస్వి కాలనీ, ధరణి కాలనీ, సుదర్శన్ నగర్ కాలనీ, సూర్యోదయ కాలనీలలో అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ నాయకులు, ఆయా కాలనీల ప్రజలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.