సమసమాజ నిర్మాణమే బిజెపి ద్యేయం.

Published: Wednesday July 07, 2021
మధిర, జులై 6, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీబిజెపి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం.బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిలివేరు సాంబశివపట్టణ కమిటీ ఆధ్వర్యంలో సేవాహి సంఘటన్ కార్యక్రమంలో భాగంగా నేడు జనసంఘ్ వ్యవస్థాపకులు భరతమాత ముద్దుబిడ్డ శ్యామ్ ప్రసాద్ ముఖర్జి గారి జయంతి ని పురస్కరించుకుని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిలివేరు సాంబశివరావు మరియు పట్టణ అధ్యక్షులు పాపట్ల రమేష్ ఆధ్వర్యంలో పలు వార్డులలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రములో ప్రతి కార్యకర్త రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు సేవకార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది అని, సమసమాజ నిర్మాణమే బిజెపి ద్యేయం అని, దేశం కోసం పాటుపడిన మహనీయులు లకు ఘనమైన నివాళి అర్పిస్తూ వారి స్పూర్తితో ప్రజాసమస్యలుపై పోరాడతాము అని అన్నారు