మండలంలో ఆకస్మికంగా పర్యటించిన కలెక్టర్
Published: Tuesday July 06, 2021
జన్నారం, జూలై 05 , ప్రజాపాలన ప్రతినిధి : జన్నారం మండలంలో కలెక్టర్ భారతి హోళీ కేరి సోమవారం ఆకస్మిక పర్యటన చేశారు. ఈ పర్యటన లో భాగంగా జన్నారం, వెంకటాపూర్ గ్రామాలలో నిర్మిస్తున్న స్మశాన వాటికల పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేసి, ఈనెల పది లోపు స్మశాన వాటికల నిర్మాణ పనులను పూర్తిచేయాలని కోరారు. లేనియెడల చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే పొన్కల్ గ్రామపంచాయతీ దుకాణాల ముందు చెత్తను చూసి పలువురు దుకాణ యజమానులకు ఫైన్ విధించారు, అలాగే గ్రామాన్ని రెండు రోజుల్లో పూర్తిగా శుభ్రంగా తయారుచేయాలని సర్పంచ్ కార్యదర్శికి ఆదేశించారు
Share this on your social network: