మంగేల గ్రామంలో రైతుబందు వారోత్సవాల సంబరాలు...

Published: Friday January 07, 2022

బీరుపూర్, జనవరి 06 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ మంగేల గ్రామంలో రైతుబందు పథకం ప్రారంభమైనప్పటి నుండి పంట పెట్టుబడి కోసం రైతుల బ్యాంకు ఖాతాల్లో వేస్తున్న నగదు జనవరి 10 తేదీ నాటికి 50 వేల కోట్లకు చేరనున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు రైతుబంధు వారోత్సవాలు మంగేల గోండుగూడెంలోఘనంగా నిర్వహించారు. మహిళలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చుంచు శారదనరేందర్ వైస్ ఎంపీపీ బల్మూరి లక్ష్మన్ రావు వ్యవసాయ అధికారిని అనూష ఏఈఓ శిరీష ఉప సర్పంచ్ దుంపేట వెంకటేష్  గ్రామశాఖ అధ్యక్షుడు రాస శంకర్ ఎస్టి మండల అధ్యక్షుడు పుర్క రామచందర్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.