ఉత్తమ ఫలితాలు సాధించిన మాతృశ్రీ కళాశాల విద్యార్థులు

Published: Tuesday October 11, 2022
చౌటుప్పల్, అక్టోబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి) చౌటుప్పల్:మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆదివారం విడుదల చేసిన డిగ్రీ రెండవ మరియు నాల్గవ సెమిస్టర్ ఫలితాలలో మరోసారి అద్భుతమైన ఫలితాలతో 5 గురు విద్యార్థులు 10/10 సాదించరు,బి.అఖిల,నాతి శ్రుతి,గంగదేవి శిరీష,సయ్యద్ అమిషా బేగం,వీరమల్ల పూజిత వీరితో పాటు 40 మందికి పైగా విద్యార్థులు 9.0 కంటే ఎక్కువ గ్రేడ్ పాయింట్లు సాధించారు
ఈ సందర్బంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల సెక్రటరీ ఎం సుభాష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవొచ్చని తెలియచేశారు,అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కళాశాల సెక్రటరీ ఎం.సుభాష్ రెడ్డి డైరెక్టర్ జి.శ్రీనివాస్ ప్రిన్సిపాల్ బి.మహేందర్ రెడ్డి మరియు అధ్యాపక బృందంతో కలిసి బహుమతులు అందచేయటం జరిగింది